వైద్యుల పై దాడులా..

ఊరుకోం మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్న మాటల్ని మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేసుకున్నారు. అలాంటి వైద్యుల పై కొందరు మూర్కులు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య సిబ్బంది పై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం నారాయణగూడలో టీఎన్జ్వో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు వైద్యులు కాపాడుతున్నారని ఈటల కొనియాడారు. ఈ శిబిరంలో 200 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు.