బ్లడ్..ఎమర్జెన్సీ రక్త దాతలు ముందుకు రావాలి

లాక్ డౌన్ కారణంగా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు ముందుకురాని దాతలు

  • తల సేమియా. హిమోఫీలియా బాధితుల విలవిల
  • అయిపోతున్న అత్యవసర రక్త నిల్వలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల యూనిట్ల రక్తం అవసరం
  • ఆసుపత్రులలో కనిష్ట నిల్వకు పడిపోయిన రక్తనిధులు
  • ఇంటివద్దకే వచ్చి రక్తం తీసుకెళతామంటున్న బ్లడ్ బ్యాంకులు
  • -9490617440 – 9490617431కు ఫోన్ చేయాలంటున్న పోలీసులు 

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ప్రజలను బయటకు రాకుండా చూసుకుంటుంది. ఏ మాత్రం బండి బయటకు తీసిన డ్రోన్ కెమెరాల ద్వారా సరికొత్త యాప్ ల ద్వారా బండి నెంబర్ కని పెట్టి ఫైన్ వేస్తున్నారు. ఇటువంటి టైములో బ్లడ్ డొనేట్ చేస్తామంటే మాత్రం నేరుగా పోలీసులు ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ తీసుకెళ్లాం అని అంటున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ ఎమర్జెన్సీ నెలకొంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన రక్త కొరత ఏర్పడింది. అత్యవసర రక్త నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ముంచుకొచ్చింది. అత్యవసర ప్రమాద కేసులు, తల సేమియా.. హిమోఫీలియా బాధితులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల యూనిట్ల రక్తం అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకులో లాక్ డౌన్ కారణంగా రక్త నిల్వలు కనిష్టానికి పడిపోయినట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉండడంతో ముందే మేల్కొని రక్త కొరతను అధిగమించడానికి సైబరాబాద్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకు లో రక్తం ఇవ్వాలనుకుంటే తమను సంప్రదిస్తే వారి ఇంటికొచ్చి బ్లడ్ బ్యాంక్ వద్ద దింపి తిరిగి ఇంటికి తామే దింపుతామని ప్రకటించారు. రక్తం ఇస్తామంటే చాలు దండం పెట్టి మరి రక్త దాతలను తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. అంత కొరత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రక్త దాతలు బ్లడ్ ఇవ్వాలనుకుంటే 9490617440 – 9490617431కు ఫోన్ చేస్తే చాలు మేమే మీ దగ్గరికి వచ్చి సురక్షితంగా బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇంటికి చేరుస్తామని అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆధీనంలో రక్త సేకరణ శిబిరా లు జరగడం లేదని, దీంతో రక్తం అవసరమ య్యే రోగుల కోసం రక్త దాతలు ముందుకు రావాలని ఐపిఎం(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటి న్ మెడిసిన్) ప్రకటించింది. రక్తం ఇవ్వాలనుకునే దాతలు నేరుగా ఐపిఎంకి రావాలని డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నారాయణగూడలో ఉన్న ఈ కేంద్రంలో ప్రతి రోజు సగటున 100 నుంచి 115 యూనిట్లు సేకరిస్తున్నామని, వీటిని మరింత విశ్లేశించి వేర్వేరు కాంపొనెంట్లగా కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే రక్త దాతలందరూ సులభంగా కేంద్రానికి చేరేందుకు ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ జిల్లా డిఎంహెచ్ ఓ డా వెంకట్ 8497958597ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. కరోనా ఎఫెక్ట్.. లాక్ డౌన్ కారణంగా బ్లడ్ కు కొరత ఏర్పడింది. డోనర్స్ కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నయి. బ్లడ్ అత్యవసరమై వచ్చిన వారికి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అందించలేకపోతున్నరు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 174 బ్లడ్ బ్యాంకులుండగా, అందులో 83 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి అందజేస్తుంటారు. కొందరు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ద్వారానో బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. ఇది కాకుండా విద్యా సంస్థలు, ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు సంస్థలు బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహించి సేకరిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా క్యాంపులకు పర్మిషన్స్ లేవు. ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే నేరుగా బ్లడ్ బ్యాంక్ కే వెళ్లాల్సి ఉంది. లాక్ డౌన్‌ డోనర్స్ కూడా బయటకు రావడం లేదు. వీరికి బ్లడ్ తప్పనిసరిగా కావాలి తల సేమియా, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్లకు ప్రతి నెలా మస్ట్ గా బ్లడ్ ఎక్కించాలి. వీరు అందుబాటులోని బ్లడ్ బ్యాంకుల్లో ముందుగానే పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం వీరికి, ఎమర్జెన్సీ డెలివరీ కేసులకు మాత్రమే బ్లడ్ ఇస్తున్నామని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక వీరితో పాటు కేన్సర్ పేషెంట్లకు కూడా వైట్ బ్లడ్ సెల్స్ అవసరమవుతాయి. వీటి నిల్వలు కూడా లేవు. లాక్ డౌన్ కారణంగా తగ్గిపోయిన నిల్వలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో రక్తం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని బ్లడ్ నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో సాధారణ సర్జరీలు నిలిపివేయడంతో రక్తానికి డిమాండ్ తగ్గింది. అయినా బ్లడ్ కొరత ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఐపీఎంల ద్వారా కలెక్షన్ ప్రభుత్వాసుపత్రులకు డోనర్స్ రాకపోతుండడంతో ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్) ద్వారా బ్లడ్ కలెక్షన్ చేయాలని మెడికల్ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుల స్టాఫ్ తో మీటింగ్ నిర్వహించారు. కొవిడ్ బ్లడ్ బ్యాంక్ పెడతాం: ముందుకొచ్చిన బయోకాన్ కంపెనీ కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల కోసం యాంటీ బాడీరిచ్ ప్లాస్మా కొవిడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తామని బయోకాన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ విషయమై మంత్రి కేటీఆర్ తో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ పర్సన్ కిరణ్ మంజుందార్ షా ఫోన్ చేసినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైద్య శాఖకార్యదర్శి, కమిషనర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కిరణ్ మంజుందార్ షాకు ‘థ్యాంక్స్ కిరణ్’అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఆర్మీ వాళ్లు డొనేషన్ విద్యానగర్ లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో 700-800 యూనిట్ల బ్లడ్ స్టాక్ ఉంటుంది. ప్రస్తుతం వాటి సంఖ్య చాలా తగ్గింది. ఇక్కడికి రోజూ తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్లు 25%-30 % మంది వరకు వచ్చి బ్లడ్ ఎక్కించుకుంటారు. ప్రస్తుతం ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లమ్స్ తో కొంతమంది రావడం లేదని తెలిసింది. వచ్చిన వారికి అందిస్తున్నాం. లాక్ డౌన్ తో డోనర్స్ కూడా తగ్గిపోయారు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లాం. ఆమె స్పందించి ఆర్మీ ఆఫీసర్ కు చెప్పడంతో ప్రస్తుతం రోజూ 20 యూనిట్లు డొనేట్ చేస్తున్నారు. ఇది కూడా సరిపోవడం లేదు. బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకు రావాలి. ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ 7032888001ను సంప్రదించాలి. అంటున్నారు వైద్యులు. బ్లడ్ ఇచ్చేందుకు డోనర్స్ రావడం లేదు. ఇంతకుముందుతో పోల్చితే 90శాతం తగ్గిపోయారు. కరోనా ఐసోలేషన్ వార్డులు ఉండడంతోనే బ్లడ్ డొనేట్ చేసేందుకు రావడం లేదని అంటున్నారు. మా వద్ద స్టాక్ లేని బ్లడ్ గ్రూప్ లను ఐపీఎం నుంచి తెప్పించి రోగులకు అందిస్తున్నాం. బ్లడ్ డొనేట్ చేసేందుకు డోనర్స్ ముందుకు రావాలి. మానవత్వంతో ఆదుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో డోనర్స్ మానవత్వంతో ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి. కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు తక్కువ మందిలో ఉంటాయి. అలాంటి సమయంలో బ్లడ్ అత్యవసరమైతే చాలా కష్టమవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదముంది. బ్లడ్ ఎమర్జెన్సీ అయితే డోనర్స్ కి కాల్ చేసి పిలుస్తున్నాం అంటున్నారు సామాజిక కార్యకర్తలు.