లాక్ డౌన్ సడలింపు పై మల్లగుల్లాలు!

19న జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు ఉండగా.. కేంద్రం దేశ్యవాప్తంగా వచ్చేనెల మూడో తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. ఈ నెల 20 నుంచి కొన్ని మినహాయింపులను కూడా కేంద్రం ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. లాక్ డౌన్ ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాల పై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్ డౌన్ అమలవుతుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది. బాధితుల్లో ఇప్పటి వరకూ మె ఎత్తం 118 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. ఇవాళ మరో 128 మంది డిశ్చార్జి కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 514 మంది వైరస్ తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 259 కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. టీబీ వ్యాధికి అంతమెప్పుడు? మనదేశంతో పాటు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ క్షయరోగం కారణంగా ముఖ్యంగా పేద కుటుంబాలు ఉ క్కిరిబిక్కిరయిపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది క్షయ వ్యాధికి గురవ్రతుండగా 16 లక్షల మంది ఈ వ్యాధికారణంగా అసుష్ఠులు బాస్తున్నారు. కరోనా, సార్స్, స్వైన్ ఫ్లూ, క్షయ ఇవన్నీ శ్వాసకోశ సంబంధ అంటువ్యాధులే. అయితే కరోనా, సార్స్, స్వైన్ ఫ్లూ, ఉప్పె నలా విరుచుకుపడేవయితే, క్షయను మాత్రం నిశ్శబ్ద హంతకిగా చెబుతారు. ఎయిడ్స్ తర్కాత ఎక్కువ మందిని బలిగొఒంటున్న అంటు వ్యాధి ఈ క్షయ. మైక్రో బాక్టీరియామ్ ట్యూబర్ క్యులోసిస్ అనే బాక్టీరియా ఈ క్షయ వ్యాధిని కలిగిస్తుంది. డాక్టర్ రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికారక బాక్టీరియాను 1882 మార్చి 24న కనుగొన్నందున, ఆ రోజున ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినంగా జరుపుతున్నారు. మనదేశంతో పాటు ప్రపంచమంతటా ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీర్ఘకాలంగా ఉండే దగ్గు, రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టడం, శ్వాసించడంలో ఇబ్బందులు, ఛాతినొప్పి, ఆకలి తగ్గటం, బరుద్ధ తగ్గడం మొదలైన లక్షణాల ద్వారా ఈ వ్యాధిని ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఛాతీ ఎక్సరే, పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర అవయవాలకు సోకిన క్షయను గుర్తించడానికి సి.టిస్కాన్ ఎమ్ఎ ఆస్ట్ స్కాన్ లాంటి పరీక్షలు ఉపకరిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం జనాభా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది భారత్ లోనే ఉన్నారు. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది క్షయరోగులు ఉంటారని ఒక అంచనా. 2018లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా మనదేశంలో ఈ మరణాలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2019 టిబి ఇండియా నివేదిక మనదేశంలో ఈ వ్యాధి తీవ్రతను కళ్లకు కట్టింది. ఈ నివేదిక ప్రకారం మనదేశంలో 2017-18లో లక్షల కేసులు నమోదుకాగా, 2018లో 17 శాతం పెరిగి 21.5 లక్షల కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. హెచ్ఐవి రోగుల మరణాలకు టిబి ఒక కారణంగా మారుతుంది. మనదేశంలో 25 లక్షల హెచ్ఐవి బాధితుల్లో 18 లక్షల మంది క్షయరోగులున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి మూలంగా ఏటా సుమారు 20 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ప్రధాని వెల్లడించారు. 2030 నాటికి ప్రపంచంలో క్షయలేకుండా చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పిస్తుండగా దానికి ఐదు సంవత్సరాలు ముందుగానే 2025 నాటికి మనదేశంలో క్షయవ్యాధిని నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నది. కేంద్రం 2019 సెప్టెంబరు ఐదున ‘టిబి హారేగా దేశ్ జీతేగా నినాదంతో ఈ వ్యాధి నిర్మూలనకు నడుం బిగించింది. పొగ త్రాగేవారిలో, మద్యపానం, అధికంగా చేసే వారితో, పాన్ పరాగ్, గుట్కా, మత్తు పదార్థాలు వాడేవారు ఎక్కువగా క్షయ బారిన పడుతున్నారు. నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం, పేదరికం, వ్యాధి గురించి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి విజృంభిస్తున్నది. బహిరంగంగా పొగతాగరాదన్న నిబంధన ఎక్కడా అమలు జరగడం లేదు. సరైన మోతాదులో మందులు వాడకపోయినా, మధ్యలో మందులు మానివేసినా ఈ వ్యాధి లొంగని మొండి వ్యాధిలా మారుతుంది. కొన్ని రకాల టిబిలు మందులకు కూడా లొంగడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి సులభంగా సోకి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఔషధాల కొరత కారణంగా ప్రపంచం లో ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికే చికిత్స జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంకా ఎన్నో క్షయ కేసులను గుర్తించక లెక్కల్లోకి రావడం లేదు. దగ్గటం, తుమ్మటం ద్వారా తుంపరులతో ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. క్షయ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా, ఆశించినంతగా ఫలితాలు రావటం లేదు. ఈ రోగ నిర్మూలనకు కేటాయించే నిధులు సక్రమంగా పారదర్శకంగా ఖర్చయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. క్షయవ్యాధి నిర్ధారణ, నిర్మూలన కార్యక్రమాలు విస్త ృతంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొబైల్ లాబ్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. అధునాతనమైన వైద్యం అందుబాటులోకి వచ్చినా వ్యాధిని అరికట్టలేకపోవడం పై ఆలోచన చేయాలి. 1962లోనే జాతీయ టిబి నియంత్రణ ప్రణాళిక మొదలయినా ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేష్ఠ. లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోదు. ఆ లక్ష్యాలను చేరడానికి సరైన కృషి, ప్రణాళిక అవసరం. రోగ నివారణలో మన పొరుగు దేశాలు కొన్ని పురోగతి సాధిస్తుండగా మన వెనుకబాటుకు కారణాలను నిజాయితీగా గుర్తించాలి. టిబి నివారణలో రాష్ట్రాల మధ్య మంచి పోటీ ఏర్పడాలి. గుట్కాలను నిషేధించినా ప్రతి గ్రామంలో ఎక్కడో ఒక చోట ఇప్పటికీ వీటి అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడంతో పాటు రోగం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి నివారణ చర్యలు సమగ్రంగా చేపట్టాలి. క్షయవ్యాధి పీడితులున్న కుటుంబాల్లోని బాలలు తప్పనిసరి పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారు. వెంట్రుకలు, గోళ్లు, మరికొన్ని భాగాలు మినహా ఏ శరీర భాగం పైనయినా దాడి చేయగలదీ రోగం. క్షయ వ్యాధి బాధిత కుటుంబాలకు కేంద్రం ‘నిక్షయపోషణ్ యోజన కార్యక్రమం కింద 500 రూపాయలు చొప్పున 26 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ సాయాన్ని వెయ్యి రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉ ంది. మందులు వాడిన కొన్ని రోజుల తర్వాత సానుకూల ఫలితాలు వచ్చినా మందులు మధ్యలో ఆపకుండా డోసు ప్రకారం వాడాలి. పసిపిల్లల్లో క్షయవ్యాధి రాకుండా బిసిజి టీకా వేయించాలి. క్షయ నిర్ధారణకు భారతశాస్త్రవేత్తలు రూపొందించిన ట్రూనాట్ టీబిటెస్ట్ తొంభై నిమిషాల్లోనే క్షయ లక్షణాలను పట్టేస్తుంది. ఈ పరీక్షను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించింది. ప్రభుత్వాల చర్యల్లో పురోగతి కనిపిస్తున్నా, ఇంకా అనేక మంది ఈ వ్యాధి కారణంగా అసులుష్ఠ బాస్తున్నారు. ఈ వ్యాధి గురించి సమాజాన్ని మరింత చైతన్యం చేయాల్సిన అవసరం చాలా ఉంది. పోలియోలాగా క్షయను కూడా సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వంతో పాటు యావత్ సమాజం కంకణబద్ధులు కావాలి. కుష్టువ్యాధి, గజ్జి, క్షయ (టీబీ) వంటి వ్యాధుల్ని మనం లైట్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ జబ్బులు ఇప్పుడు లేవని మన ఫీలింగ్. నిజమే కుష్టువ్యాధి, గజ్జి, తామర వంటివి ఇప్పుడు దాదాపు లేవు. కానీ, క్షయ వ్యాధి మాత్రం సైలెంట్ గా విస్తరిస్తోంది. దురదృష్టమేంటంటే ప్రపంచంలోనే క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నది భారత్ లోనే. వ్యాధి గురించి సరిగా తెలియకపోవడం, దాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో… దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోంది, రోజూ దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తెలంగాణలో 72,674 టీబీ కేసులు ఉన్నాయంటే నమ్మగలరా. అసలా వ్యాధి ఎలా సోకుతుంది? రాకుండా ఏం చెయ్యాలి? వస్తే, ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. ప్రాణాలు తీసే క్షయ వ్యాధి మైకోబ్యాక్టీరియమ్ టూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతోందని 1882, మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కుచ్ తెలుసుకున్నాడు. దాని నివారణ కోసం ప్రయత్నించాడు. 1905లో ఆయన్ను నోబెల్ బహుమతి వరించింది. గొంతులో ఏదో (కఫం) ఉన్నట్లు దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గకుండా ఉందామన్నా ఉండలేం. పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఏం చేసైనా సరే… రెండు వారాల్లో పొడి దగ్గును తగ్గించేసుకోవాలి. లేదంటే అదే క్షయ వ్యాధి వచ్చేందుకు కారణం అవుతుంది. క్షయ వస్తే ఇక దగ్గు ఆగదు. కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం వస్తూ ఉంటుంది, చెమటలు పడతాయి.లి బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇది స్పష్టంగా కనిపించే లక్షణం. ఎంత తిన్నా బరువు తగ్గిపోతారు. అసలు ఆకలే వెయ్యదు. పెద్దగా పనిచెయ్యకపోయినా ఆయాసం వచ్చేస్తుంది. నీరసం కూడా వస్తుంది. వ్యాధి ముదురుతూ ఉంటే, దగ్గుతోపాటూ (కఫంతో పాటూ)… రక్తం కూడా వస్తూ ఉంటుంది. సమస్యేంటంటే… టీబీ ఒక రకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్లు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మివేసినప్పుడు… బయటకు వచ్చే గాలిలో ఉండే తుంపర్లలో బ్యాక్టీరియా… చుట్టుపక్కల వాళ్లకు చేరుతుంది. అలా వ్యాధి వాళ్లకు కూడా సోకుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. మొదటిది ఊపిరితిత్తుల క్షయ. ఇది మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. రెండోది ఇతర అవయవాల క్షయ. శరీరంలో ఏ అవ యవానికి క్షయ వ్యాధి రావచ్చు. ఊపిరితిత్తుల క్షయ వ్యాధి మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యాపించే ప్రమాదం ఉ ంటుంది. మంచి ఆహారం తీసుకోవాలి. స్పైసీ (మసాలా) ఫూడ్ తగ్గించాలి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి వాటిని వీలైనంత త్వరగా తగ్గించేసుకోవాలి. లి రెండు వారాల కంటే ఎక్కువ రోజులు పొడి దగ్గు వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ ను కలవాలి. టీబీ పై కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. టీబీ ఓడిపోవాలి, ఇండియా గెలవాలి అనే నినాదం తీసుకుంది. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. క్షయవ్యాధి ఉన్న వారికి నెలకు రూ.500లను ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తోంది. కొంతమందిలో సాధారణంగా మందులు వాడగానే వ్యాధి తగ్గిపోతుంది. తాగుడు, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే, వ్యాధి త్వరగా తగ్గకపోగా, ఎండీఆర్ టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ)గా మారుతుంది. వ్యాధి నిర్ధారణ సమయంలో రోగికి సాధారణ టీబీ ఉందా లేక ఎండీఆర్ టీబీ ఉందా అనే దానిని నిర్ధారిస్తారు. లి క్షయకు ఇచ్చిన మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో మానేస్తే ప్రమాదం. మళ్లీ వచ్చేస్తుంది. డాక్టర్లు చెప్పిన మాట వినాల్సిందే. 2030 నాటికి క్షయరహిత ప్రపంచమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం దాకా టీబీ వ్యాప్తి తగ్గుతోంది. 2000-17 మధ్య కాలంలో టీబీని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా 5.4 కోట్ల మందిని కాపాడగలిగారు. ఇదంతా కాదు. అసలీ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడదాం. దురదృష్టవశాత్తూ సోకితే… ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి… దాన్ని తరిమికొడదాం.