కోళ్ల మేతకూ..కరోనా

మొన్నటిదాకా ధర లేక..ఇప్పుడు దాణా కొరతతో పౌల్టీ పరిశ్రమ డీలా

  • దాణా దొరకక చనిపోతున్న కోళ్లు
  • చికెన్ ధర ఇప్పుడిప్పుడే పెరుగుతోంది
  • ఎక్కడికక్కడ దాణా సరఫరా నిలిపివేత
  • కుదేలవుతున్న పౌలీ పరిశ్రమ
  • కొన్ని చోట్ల కత్తీ దాణా సరఫరా
  • కత్తీదాణాతో చనిపోతున్న కోళ్లు
  • ప్రభుత్వమే ఆదుకోవాలని వినతి

హైదరాబాద్: కరోనా దెబ్బకు కోళ్ల పరిశ్రమ కకావికలమైంది. కొనేవారు లేక మాంసం ధర పడిపోవడం, దాణా కొరత కోళ్ల రైతులను పట్టిపీడిస్తోంది. ధరలు లేక కోళ్లను మేపలేక ఇప్పటికే చాలా కోళ్లను అయిన కాడికి తెగనమ్ముకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని కిలో బ్రాయిలర్ చికెన్ రూ.120 వరకు ధర పలుకుతున్న తరుణంలో ఉన్నవాటిని మే పేందుకు అవసరమయిన దాణా లేకుండా పోయింది. కొందరి వద్ద నేటితో నిల్వలు పూర్తవగా మిగిలిన రైతుల వద్ద మూడు నాలుగు రోజులకు సరిపడ దాణా మాత్రమే ఉంది. లక్ష టన్నుల దాణా అవసరం తెలంగాణలో కొన్ని జిల్లాలలో బ్రాయిలర్, లేయర్ రకాల కోళ్ళను రైతులు పెంచుతున్నారు. 120 మంది రైతులు 75 వేల లేయర్ (గుడ్డు పెట్టే కోళ్ళు) కోళ్ళను, 600 మంది రైతులు సుమారు కోటి వరకు బ్రాయిలర్, లింగాపురం (మాంసం కోసం పెంచే కోళ్ళు) కోళ్లను మేపుతున్నారు. లేయర్ రకానికి చెందిన కోడి సగటున రోజుకు 100 గ్రాముల దాణాను తింటుండగా బ్రాయిలర్, లింగాపురం కోళ్లు ఒక బ్యాచ్ కి (40 నుంచి 45 రోజుల మధ్య, నాలుగు నుంచి నాలుగున్నర కిలోల దాణాను తింటాయి. దీని ప్రకారం జిల్లాలోని లేయర్ కోళ్ళకు (వీటి జీవిత కాలం ఐదేళ్ళు) 90 రోజులకు కలిపి 67,500 టన్నులు, బ్రాయిలర్ కోళ్లకు 90 రోజులకు 45 వేల టన్నుల దాణా అవసరముంది. రెండూ కలిపితే 1,12,500 టన్నుల దాణా అవసరం. అయితే సుమారు సగం మంది కోళ్ళ రైతుల వద్ద దాణా స్టాకు నేటితో పూర్తయింది. మిగిలిన రైతుల వద్ద మూడు నాలుగు రోజులకు సరిపడే స్టాకుంది. దాంతో రేపటి నుంచి కోళ్ళకు మేత ఎలా పెట్టాలనే ఆందోళన రైతుల్లో మొదలయ్యింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సుమారు 5 వేల టన్నుల దాణా మాత్రమే అందుబాటులో వున్నట్లు కోళ్ళ రైతులు చెబుతున్నారు. ఆగిన సరుకు రవాణా కోళ్ళ దాణాను చాలామంది కోళ్ళరైతులే తమవద్ద ఉండే ఫీడ్ మిక్సింగ్ ప్లాంటుల్లోనే తయారు చేస్తున్నారు. దాణాకు అవసరమయిన జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, సోయా, గానుగపిండి, తవుడు తదితర సామగ్రిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సివుంటుంది. లాక్ డౌన్లో రవాణా పై ఆంక్షలు లేనప్పటికీ లారీల డ్రైవర్లు ముందుకు రాకపోవడం, మెటీరియల్ లోడ్ చేసే హమాలీలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో సరుకు దిగుమతి కాక దాణా కొరత ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి కోళ్ళ పరిశ్రమకు నాలుగైదు రోజుల్లో దాణా సరఫరా కాకపోతే పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లాలకు చెందిన నెక్ సభ్యులు చొరవ తీసుకుని దాణా లేని రైతులకు దాణా ఉన్న వారి వద్ద నుంచి సర్దుబాటు చేశారని, ఇకపై సర్దుబాటు చేయడానికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. ఒకటి రెండు రోజుల వరకు కోళ్లు నీరు తాగి బతుకుతాయని. ఆ తర్వాత తిండిలేక చనిపోవడం మొదలైతే లక్షల్లో చనిపోతాయని ప్రస్తుతమున్న విపత్తు ముందు ఇది మరో విపత్తుగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని పౌల్టీి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న నకిలీ కోళ్ళ దాణా రాకెట్ ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ ఓటి) పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. పహాడీషరీ లో రెండేళ్ల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ నకిలీ కోళ్ల దాణా తయారీ కంపెనీ పై కొంతకాలం క్రితం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.20 లక్షల విలువైన సబ్సిడీ బియ్యం , ఇసుక, ఇతర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కిలో కోళ్ల దాణాలో 30 శాతం సన్నటి ఇసుక కలపడం విశేషం. కిలో నకిలీ కోళ్ల దాణాలో 30 శాతం కలుపుతున్న ఇసుకను సముద్రపు ఒడ్డు నుంచి ప్రత్యేకంగా లారీలలో ఇక్కడికి తరలిస్తున్నారు. కంటికి కనపడని ఈ సముద్రపు ఇసుకను సబ్సిడీ బియ్యంతో కలిపి నకిలీ కోళ్ల దాణాను తయారు చేయడం గమనార్హం. ఇందుకు సం బంధించిన వివరాలను ఎస్ఓటి అదనపు డిసి పి ఈ.రాంచంద్రారెడ్డి వెల్లడించారు. పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో శ్రీధర్ కు చెందిన పెద్ద గోడౌన్ ఉంది. ఈ గోడౌన్లో సైదులు అనే వ్యక్తి నకిలీ కో ళ్ల దాణా తయారు చేస్తున్నాడు. కిలో కోళ్ల దా ణాలో పౌరసరఫరాల శాఖ చౌకదుకాణాల ద్వారా పేదలకు సబ్సిడీపై అం దిస్తున్న బియ్యం 30 శాతం , సన్నటి ఇసుక 30 శాతం, రైస్ మిల్లులో లభించే పరం(తౌడు వరిపొట్టు మధ్యలో సన్నటి గింజ మాదిరిగా ఉండే పదార్ధం) 40 శాతం కలుపుతారు. వీటితో నకిలీ కోళ్ల దాణా తయారు చేసి ప్రతి రోజు ఒక లారీ లోడ ను ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో ఉన్న పౌల్ట్రీ ఫారంలకు సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అం దుకున్న ఎఓ టీ ఇన్ స్పెక్టర్లు నర్సింగ్ రావు, సీహెచ్ రంగస్వామి, ఎస్ఏలు పి.ఆంజనేయులు, రాములు శుక్రవారం ఉదయం పహాడీషరీలో ఉన్న ఈ నకిలీ కోళ్ల దాణా తయారీ కంపెనీ పై దాడి చేశారు. ఈ దాడిలో రూ.20 లక్షల విలువైన సబ్సిడీ బియ్యం , ఇసుక, పరంను పోలీసులు స్వాధీనం చేసుకు న్నా రు. నగరం, శివార్లలోని రేషన్ షాప్ల ద్వారా సబ్సి డీ బియ్యాన్ని ఈ గోడౌనకు అక్రమంగా తరలిం చి, దానికి ఇసుక, పరంను కలిసి నకిలీ కోళ్ల దాణా త యారు చేస్తున్నామని పోలీసుల దాడిలో పట్టు బడి న సైదులు వెల్లడించాడు. కిలో దాణాకు తమకు రూ.5 ఖర్చు వస్తుండగా మార్కెట్లో రూ.14కు విక్రయిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు శ్రీధర్ ప రారీలో ఉన్నాడు. అతనిని పోలీసుల గాలిస్తున్నారు. అయితే ప్రాణహాని ఈ ఇసుక నకిలీ కోళ్ల దాణాలో సన్నటి ఇసుకను 30 శాతం కలపడం వల్ల కోళ్లకు గీటు వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధి బారిన పడిన కోళ్లను భుజించిన వారికి కిడ్నీ, మూత్రపిండాల వ్యాధి ప్రబలే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. నకిలీ దాణా తయారీదారులు అక్రమంగా డబ్బులు సంపాదించడంతో ఇటు పౌల్ట్రీ ఫారం యజమానులు, అటు కోళ్ల మాస వినియోగ దారులు మోసపోతున్నారు. ఒక్కోసారి మూత్ర నాళ్లలోకి సన్నటి ఇసుక చేరి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఇంత ప్రమా దకరమైన కత్తీ కలుపుతూ దాణాను తయారు చేస్తున్న కంపెనీ గుట్టు రట్టు చేసిన ఎస్ఓటి పోలీసులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అభినందించారు. అప్రమత్తమైన పౌల్ట్రీ ఫారం యజమానులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పౌల్ట్రీ ఫారంలను నిర్వహిస్తున్న యజమానులు అప్రమత్తమ య్యారు. పహాడీషరీఫ్ లో నకిలీ కోళ్ల దాణా గుట్టు రట్టు అయ్యిందనే వార్తలు రావడంతో ఫారం యజ మానులు కోళ్ల దాణ పై దృష్టి సారించారు. నగరం నుంచి సరఫరా అయ్యే కోళ్ల దాణాను వారు పరీక్షిస్తున్నారు. నకిలీ కోళ్ల దాణాతో తమ కోళ్లు రోగాల బారిన పడడంతో ఫారం నష్టాలను కూడా చవిచూస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.