మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య మృతి

కావేటి సమ్మయ్య మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

కాగజ్ నగర్ టౌన్: కుమురం భీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(63) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన తెరాస తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగజ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్లు విద్యావతి, దస్తగిరి, వివిధ పార్టీల నాయకులు సమ్మయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.