పేదలకు ఇబ్బందులు కలిగించొద్దు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 

హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌస్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఓ ప్రకటన చేశారు. మనముందు భారీ సవాల్ ఉన్నదని, కానీ దాన్ని అధిగమించాలంటే, మనం మరింత పట్టుదలతో ఉండాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి వల్ల మన దేశంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వెనుకబడిన వర్గాల పరిస్థితి కూడా అయోమయంగా ఉందన్నారు. అందరం కలిసి వీరందరినీ ఆదుకోవాలని సోనియా పిలుపునిచ్చారు. పేదలకు కావాల్సిన మద్దతు ఇవ్వాలన్నారు. అప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పాల్గొన్నారు. లాక్ డౌన్ అవసరమే అయినా.. లక్షలాది మంది వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.