రెండు తెలుగు రాష్ట్రాలకు

బాలయ్య విరాళం ఏపీకి రూ.50, తెలంగాణకు రూ.50, 25 లక్షలు సినీ కార్మిక సంక్షేమానికి

హైదరాబాద్: కరోనా నివారణా చర్యలకు, సినీ కార్మిక సంక్షేమానికి నందమూరి బాలకృష్ణ రూ. 1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, రూ.50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్ధం 25 లక్షల రూపాయలని కరోనా క్రైసిస్ ఛారిటీ(సిసిసి) ఎగ్జిగ్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కి అందించారు బాలకృష్ణ. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ, కరోనాని అరికట్టడంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు