తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

రూ.65 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)

న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్ పీజీ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సీడియేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా రూ. 61.5 రూపాయలు తగ్గింది. సబ్సిడీ పరిధిలోకి రాని వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు నేడు వెలువడిన ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధర రూ.61-65 వరకూ తగ్గనుంది. గృహెూపమోగ గ్యాస్ ఇంధనం ధర క్షీణించటం ఇటీవలి కాలంలో ఇది రెండవసారి. గత నెలలో కూడా వంట గ్యాస్ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, నూతన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం, సవరించిన ధరల వివరాలు (రూపాయిలలో) ఈ విధంగా ఉన్నాయి. నగరం సవరించిన ధర పాతధర దిల్లీ 744.00 805.50 కోల్‌కతా 774.50 839.50 ముంబయి 714.50 776.50 చెన్నై 761.50 826.00 ప్రతి ఇంటికీ సంవత్సరానికి 14.2 కిలోల బరువున్న 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ ధరల పై అందచేస్తోంది. ఆ పై సిలెండర్లు కావాల్సిన వారు మార్కెట్ ధరల ప్రకారం కొనుగోలుచేయాల్సి ఉంది.