ఔటర్‌పై మృత్యుపాశం

రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో బాహ్యవయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన కూలీు వెళ్తున్న బొలేరో ట్రక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ బంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాు కోల్పోయారు. మరొక మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ ృతి చెందింది.
కరోనా ప్రభావంతో పను లేక  వీరంతా తమ సొంతగ్రామం రాయచూర్‌ కి ట్రక్‌ లో బయల్దేరారు. కానీ మ ృత్యువు వీరిని వెంటాడిరది. పెద్ద గోల్కొండ సమీపానికి రాగానే లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఓఆర్‌ఆర్‌ సిబ్బంది మ ృత దేహాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మ ృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రక్‌ లో సుమారు 30 మంది కూలీు ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్‌ కి చెందినదిగా గుర్తించారు. క ృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయు తీసుకెళుతున్నట్లు పోలీసు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.