చైనీస్‌ వైరస్‌ కరక్టే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్‌ కట్టడిపై దృష్టిసారిస్తే చిరకా వైరివర్గాు అమెరికా, చైనా మాత్రం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనాను ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన మాటల్ని సమర్థించుకున్నారు. ‘కరోనా’కు అమెరికాయే కారణమంటూ చైనా నిందు వేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం వల్లే వైరస్‌ చైనాకు పాకిందనడం తప్పుడు ఆరోపణ అని అన్నారు. అయితే, ఈ క్రమంలో అది ఎక్కడ నుంచి వచ్చిందో.. దాని పేరు పెట్టి పివడం ఏమాత్రం తప్పుకాదన్నారు. ‘చైనీస్‌ వైరస్‌’ అని వ్యవహరించడం సరైన పదమేనన్నారు. చైనాకు ప్రయాణాను నిషేధించి తాను మంచిపని చేశానని వ్యాఖ్యానించారు. అయితే, చైనాతో విభేదా వ్ల ఔషధా తయారీకి అవసరమయ్యే ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ట్రంప్‌ కొట్టపారేశారు.  ఇటీవ ఇరు దేశా మధ్య కుదిరిన తొలిదశ ఒప్పందాన్ని చైనా ఉ్లంఘిస్తుందని తాను భావించడం లేదన్నారు. చైనాకు అమెరికా ఉత్పత్తు చాలా అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సత్సంబంధాను చైనా కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో కరోనా మరణాు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ఉద్ఘాటించిన రోజునే అమెరికా-చైనాు పరస్పరం విమర్శకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించండి…
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజంతా ఇళ్లకే పరిమితం కావాని ట్రంప్‌ సూచించారు. రానున్న 15 రోజు చాలా కీకమని.. అందరూ ఇంట్లోనే ఉండి ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించాని పిుపునిచ్చారు. సమస్య త్వరలోనే అదుపులోకి వస్తుందని అప్పటి వరకు ఆంక్షు తప్పవన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితు రోజురోజుకీ మారిపోతున్నాయని.. అమెరికాలో మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సూచను పాటించనట్లైతే వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తుందని.. పరిస్థితు చేదాటిపోతే ఆర్థిక వ్యవస్థ కూడా ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇక అమెరికాలో కరోనా వైరస్‌ ఇప్పుడు అన్ని రాష్ట్రాకు పాకింది. ఇప్పటి వరకు 103 మంది మరణించగా.. దాదాపు 4500 మందికి వైరస్‌ సోకింది.