స్వదేశానికి తెలుగు విద్యార్థులు

భారత విదేశాంగ మంత్రి చొరవతో ఊపిరి పీల్చుకున్నవిద్యార్థులు

కౌలాంపూర్‌: కరోనా వైరస్‌ ఆందోళన నేపథ్యంలో మలేసియా రాజధాని కౌలాంపూర్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న సుమారు 200 మంది తొగు విద్యార్థు ఎట్టకేకు స్వదేశానికి బయల్దేరారు. కరోనా భయంతో పు దేశా నుంచి భారత్‌కు వచ్చే విమానాను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 350 మంది భారతీయు కౌలాంపూర్‌తో పాటు ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయాల్లో మంగళవారం పడిగాపు కాశారు. చిక్కుకున్న వారిలో ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, న్లెూరు.. తెంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన సుమారు 200 మంది విద్యార్థు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయమే విమానాశ్రయాకు చేరుకున్న వారంతా అర్ధరాత్రి వరకు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది. చివరికి కౌలాంపూర్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ, విశాఖపట్నాకు ఎయిర్‌ ఏషియా విమానాను అనుమతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం రాత్రి 11 గంట ప్రాంతంలో ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థుకు ఊరట భించింది. ఈ క్రమంలో తొగు విద్యార్థు ఈ మధ్యాహ్నం ఎయిర్‌ ఏషియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు. విద్యార్థును స్వదేశానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖతో సంప్రదింపు జరిపింది. సీఎంవో, ఏపీ భవన్‌ అధికాయి సమన్వయం చేసుకుంటూ విదేశాంగ శాఖ అధికారుతో ఎప్పటికప్పుడు చర్చు జరిపారు.