ఫోన్‌ పేకు యస్‌ బ్యాంకు సెగ

ఫోన్‌ పే అంతరాయంపై స్పందించిన  ఫౌండర్‌ సమీర్‌ నిగమ్‌

ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు సంక్షోభం  డిజిటల్‌ చెల్లింపు సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్‌బీఐ ఆంక్ష నేపథ్యంలో ఫోన్‌పే సేవకు  తీవ్ర అంతరాయం ఏర్పడిరది. దీంతో  అటు యస్‌ బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్‌ పే  యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెకొంది. దీనిపై ఫోన్‌ పే వ్యవస్థాపకుడు సమీర్‌ నిగమ్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ట్వీట్‌ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు. తమ బ్యాంకింగ్‌ భాగస్వామి యస్‌ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో ఫోన్‌ పే సేమ ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమ్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు. తాత్కాలిక నిషేధ నిబంధన ప్రకారం కరెంట్‌ అకౌంట్లతో కుపుకొని ఖాతాదారుంతా కూడా ఏప్రిల్‌ 3 దాకా రూ. 50 వేకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. అటు యస్‌ బ్యాంకు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిన నేపథ్యంలో బోర్డును కూడా రద్దు చేసిన ఆర్‌బీఐ.. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్‌ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.  దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో యస్‌ బ్యాంకు భారీ నష్టాను మూటగట్టుకుంది. దాదాపు 89 శాతం కుప్పకూలి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు యస్‌ బ్యాంక్‌ను ఎల్‌ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్‌ చేయనుందంటూ వార్తు వచ్చాయి. ఇది ఇలా ఉంటే భారీ స్కామ్‌తో కుదేలైన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌(పీఎంసీ) బ్యాంకుపైనా ఆర్‌బీఐ కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఆంక్షలే విధించింది. అది జరిగిన 6 నెల వ్యవధిలోనే యస్‌ బ్యాంక్‌పైనా రిజర్వ్‌ బ్యాంక్‌ అటువంటి చర్యు తీసుకున్న సంగతి తెలిసిందే.