మక్కా సందర్శనపై తాత్కాలిక నిషేధం

కరోనా వైరస్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేసిన సౌదీ విదేశాంగ శాఖ

రియాద్‌: సౌదీ అరేబియాలోని మక్కా లేదా మదీనా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు సౌదీ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనను సృష్టిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మక్కాను సందర్శించేందుకు ఇప్పటికే వీసాపై తమ దేశం వచ్చిన విదేశీయును తగిన వైద్య పరీక్ష అనంతరం మక్కా సందర్శనను అనుమతిస్తామని, ఇక ముందు, ముఖ్యంగా కోవిడ్‌ వైరస్‌ విస్తరించిన దేశాకు చెందిన యాత్రికును ఎంత మాత్రం అనుమతించమని ప్రకటనలో సౌదీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ప్రతి ఏడాది జరిగే హజ్‌ యాత్ర సందర్భంగా జూలై నెలో ప్రపంచంలోని పు దేశా నుంచి ముస్లిరు మక్కాను సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు పవిత్రమైన ప్రధాన ఇస్లాం మత క్షేత్రాల్లో మక్కాను ఒకటిగా భావిస్తారు. అందుకనే ఒక్క జూలై నెలోనే దాదాపు 30 క్ష మంది మక్కాను సందర్శిస్తారు. మక్కా సందర్శనపై ప్రస్తుతం విధించిన నిషేధాన్ని జూలై నాటికి ఎత్తి వేస్తారా, కొనసాగిస్తారా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.