కూల్చివేతపై తొందరెందుకు?

కొత్త సచివాయ నిర్మాణంపై హైకోర్టు వ్యాఖ్యు

హైదరాబాద్‌: నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ లేకుండానే కొత్త సచివాయం నిర్మించాని తెంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సచివాయం కూల్చివేతపై ఉన్నత న్యాయస్థానంలో బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) వాదను వినిపించారు. కొత్త సచివాయం నిర్మాణంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోలేదని అదనపు ఏజీ కోర్టుకు తెలియజేశారు. తుది నిర్ణయం తీసుకోకుండానే భవనా కూల్చివేతపై ప్రభుత్వానికి తొందరెందుకని  న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వు వచ్చే వరకు భవనాు క్చూవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గత విచారణలో కూల్చివేతపై ప్రభుత్వాన్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. అయితే నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. మరి డిజైన్లు, ప్లాన్‌ పూర్తి కానప్పుడు కూల్చివేతకు ప్రభుత్వానికి ఎందుకు తొందర అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇంకా డిజైన్‌, ప్లాన్‌ ఇంకా సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ?్య్షనించింది. కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న కేబినెట్‌ మరి.. డిజైన్‌ ప్లాన్‌ కోసం నిర్ణయం ఎందుకు తీసుకోలేదని, నూతన సచివాయం మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునేవరకూ ఎలాంటి కూల్చివేతు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.