రైల్వే ఉద్యోగులకు బోనస్‌

ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

న్యూఢిల్లీ: దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ అందించే కీలక నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 11 లక్షల పైచిలుకు రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం దిల్లీలో ప్రకటించారు. ”దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు బోనస్‌ అందనుంది. గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నిలకడగా ఏటా బోనస్‌ ఇస్తూ వస్తున్నాం. ఈ ఏడాది కూడా 11.52 లక్షల మంది ఉద్యోగులు 78 రోజుల బోనస్‌ పొందనున్నారు. రైల్వేలో మెరుగైన ఫలితాలకు ఇది రివార్డు లాంటిది” అని జావడేకర్‌ అన్నారు.