‘యురేనియం’పై నిషేధం

తవ్వకాలపై తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్‌: నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా యురేనియం అన్వేషణ కూడా కొనసాగించరాదని తీర్మానం చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్మానం ప్రవేశపెట్టారు. పర్యావరణానికి, జీవావరణానికి, ప్రక తి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని… మానవాళితో పాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యం అయి మనిషి జీవితం నరక ప్రాయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివ ద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని… ప్రజల భయాందోళనతో సభ కూడా ఏకీభవిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.