అభిమానులకు షాకిచ్చిన నిక్కీ

ఇకపై పాడబోనని ప్రకట

వాషింగ్టన్‌:
పముఖ అమెరికన్‌ ర్యాపర్‌, గాయని నిక్కీ మినాజ్‌(36) తన అభిమానులకు షాకిచ్చింది. నిక్కీ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించగానే కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక పై తాను కుటుంబ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు నిక్కీ తెలిపారు. సంగీత పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇకపై తాను కుటుంబ జీవితం గడపాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే తన తాను చనిపోయేంతవరకు తన అభిమానులు తనను అభిమానిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 2 కోట్ల అభిమానులను సంపాదించుకున్న నిక్కీ మినాజ్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌ జూ పెటీని రహస్యంగా పెళ్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన ట్విటర్‌ అకౌంట్‌ పేరును మిసెస్‌ పెటీగా మార్చుకోవడం విశేషం. ఇప్పటికే పెటీని పెళ్లాడబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా 2010లో ‘పింక్‌ ఫ్రైడే’ అల్బమ్‌ తో నిక్కీ మినాజ్‌ పాప్‌ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ది పింక్‌ ప్రింట్‌, క్వీన్‌, ప్లే టైమ్‌ ఈజ్‌ ఓవర్‌ వంటి ఆల్బమ్స్‌ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మినాజ్‌ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్‌ హాప్‌ కళాకారులలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన కెరీర్‌ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, ఆరు అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకున్నారు.