‘నగర కీర్తన్‌’

ప్రకాష్‌ ప్రబ్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ : అమీర్‌పేటలోని గురుద్వారాలో గురునానక్‌ ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర ఘనంగా జరిగింది. సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ యాత్రకు హాజరయ్యారు. యాత్ర ప్రారంభం కంటే ముందు నిర్వహించిన గురునానక్‌ ప్రకాష్‌ యాత్రలో భాగంగా జరిగే ”నగర కీర్తన్‌” కార్యక్రమంలో కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అనంతయం ప్రకాష్‌ ప్రభ్‌ యాత్రను కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిక్కులు పాల్గొన్నారు.