టి.20లకు వీడ్కోలు

మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ నిర్ణయం 
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2021 ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ను దష్టిలో ఉంచుకొని టీ20 ఫార్మాట్‌కు దూరం అవుతున్నానని వెల్లడించింది. ఇప్పటి వరకు 32 టీ20లు ఆడిన ఆమె 2012 (శ్రీలంక), 2014 (బంగ్లాదేశ్‌), 2016 (భారత్‌)లో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడింది. 
‘2006 నుంచి భారత్‌కు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన నేను టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నా. 2021 వన్డే ప్రపంచకప్‌పై దష్టిపెట్టాలని భావిస్తున్నా. ఆ టోర్నీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పొట్టి ఫార్మాట్‌కు దూరమవుతున్నా. నా దేశానికి ప్రపంచకప్‌ అందించాలన్నది ఎప్పటికీ నా కల. అత్యుత్తమంగా పోరాడాలన్నదే నా లక్ష్యం. నన్ను నిరంతరం ప్రోత్సహించిన బీసీసీఐకి ధన్యవాదాలు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడే భారత టీ20 జట్టుకు అభినందనలు’ అని మిథాలీ భావోద్వేగంతో ప్రకటించింది. పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగుల రాణి మిథాలీనే. 89 మ్యాచుల్లో 37.5 సగటుతో 2,364 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 99లి. ఇంగ్లాండ్‌పై గువాహటిలో 1999లో తొలి టీ20 ఆడింది. టీ20ల్లో 2000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ మిథాలీ. ఇక 203 వన్డేల్లో 51.29 సగటుతో 6,720 పరుగులు చేసింది. 10 టెస్టుల్లో 663 పరుగులు సాధించింది.