ఎన్‌ఆర్‌సీ ఇక్కడా అమలుచేయాలి

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 

హైదరాబాద్‌: అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా నేడు విడుదల అయింది. కాగా దీనిని తెలంగాణలోనూ అమలు చేయాలని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు రాజాసింగ్‌. ”హైదరబాద్‌ ఎంపీ, తన ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు తెలంగాణలో చోటు కల్పిస్తున్నారు. అసోంలో అమలు చేసిన ఎన్‌ఆర్‌సీని తెలంగాణలోనూ అమలు చేయండి. తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్‌ 17 నుంచి దీనిని అమలు చేయాలని హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాను ట్యాగ్‌ చేశారు.