అడవుల పునరుద్ధరణకు చర్యలు

దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి: కేసీఆర్‌ 

”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేది. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేశాము. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. వర్షపాతం కూడా పెరిగింది. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడంతో అవి మంకీ ఫుడ్‌ కోర్టుల్లా తయారవుతున్నాయి. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి” 
– కేసీఆర్‌ 

  • రాష్ట్రవ్యాప్తంగా అడవుల అభివృద్ధికి కార్యాచరణ 
  • 60 రోజుల కార్యాచరణ పథకం 
  • సామాజిక అడవుల పెంపకంతోనే వాతావరణ మార్పులు 
  • జీవవైవిధ్యంతోనే విస్తారవంతంగా వర్షాలు 
  • అందుబాటులో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి 
  • అదే నిష్పత్తిలో లేని అడవులు 
  • మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం 
  • పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి 

గజ్వేల్‌: 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని సీఎం చెప్పారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోందని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడంతో అవి మంకీ ఫుడ్‌ కోర్టుల్లా తయారవుతున్నాయని చెప్పారు. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 
అటవీభూమి ఉన్నంత నిష్పత్తిలో అడవులు లేవు 
రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4శాతం అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. గజ్వేల్‌ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్‌ స్టాక్‌ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని చెప్పారు. బయటి జంతువులు లోపలకు రావడం.. లోపలి జంతువులు బయటకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావాల్సిన తేమ అందుతోందని వివరించారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతోందని.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గి, వర్షపాతం పెరుగుతుందన్నారు. దీంతో జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు కలెక్టర్లకు వివరించారు. ఉన్న అడవులను కాపాడుకోవాలని.. అందులో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాల సీఎం సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 
60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి 
అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం అమలు.. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైనా కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని.. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. 
వర్గల్‌ మండలంలోని సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగారాయపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ ఫలితాలను జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీభూములు ఎడారిలా ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయగా పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని సీఎం తెలిపారు. ఇపుడు ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు. జ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని..రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. 
అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 
పచ్చదనంతో కళకళలాడాలి.. 
అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండు గంటలపాటు మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం అమలు పైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని వివరించారు. 
హరితహారం, మిషన్‌ భగీరథ పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఈటెల రాజేందర్‌, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌ రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.