బాధితులకు అండగా ‘ఉన్నావ్‌’! హ్యాట్సాఫ్‌…సంపత్‌ మీనా

ఇటీవల కాలంలో ఉన్నావ్‌ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు 45 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మరి రాజకీయ ప్రముఖులతో ముడిపడి ఉన్న ఇంతటి కీలక కేసును దర్యాప్తు చేస్తున్నది ఎవరో తెలుసా? ఓ మహిళా ఐపీఎస్‌ అధికారి.. పేరు సంపత్‌ మీనా. ప్రస్తుతం లక్నో జోన్‌ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెది దూసుకుపోయే తత్వం. మహిళల సమస్యలు, మానవహక్కులపై పోరాడిన నేపథ్యం. పిల్లల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ధీరత్వం.
‘ఉన్నావ్‌ బాధితురాలికి న్యాయం చేయండి’ అని నినదిస్తోంది మహిళాలోకం. ‘ఇలాంటి మ గాలు సమాజంలో బతకకూడదు’ అని కుల్‌దీప్‌ దిష్టిబొమ్మను తగులబెడుతోంది యువత. ‘న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అంటున్నాయి బాధితురాలి ఉచ్వాసనిశ్వాసలు. ఇలాంటప్పుడే… సరిగ్గా ఇలాంటప్పుడే… దుష్టశిక్షణ… శిష్ట రక్షణ కోసం ఒకరు రావాలి. అలా వచ్చినవారే… సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌సంపత్‌ మీనా.
సంపత్‌ మీనా లక్నోలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌. ఇప్పుడామె దేశాన్ని కుదిపేసిన ‘ఉన్నావ్‌’ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. ఉన్నావ్‌ కేసు దర్యాప్తు చేపట్టి 45 రోజుల్లో పూర్తి చేయవలసిందిగా సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి కేసును సమర్థంగా దర్యాప్తు చేయగలిగిన అధికారి కోసం దష్టి సారించిన సీబీఐకి సంపత్‌ మీనా అయితేనే కేసుకు న్యాయం జరుగుతుందనే భరోసా కలిగింది. ఫలితంగా ఉన్నావ్‌ కేస్రును ఆమె చేతుల్లో పెట్టింది. సంపత్‌ మీనా కేసు దర్యాప్తు బాధ్యత చేపట్టడంతో న్యాయపోరాటం చేస్తున్న బాధిత యువతికి అధికారం, సమర్థత కలిగిన మహిళ ఆసరాగా వచ్చినట్ల్కెంది. ఉన్నావ్‌ ఘటనతో ఏడాదికి పైగా నిరసనలు, ర్యాలీలతో అట్టుడిగిన దేశం ఇప్పుడు ‘హమ్మయ్య… బాధితురాలికి న్యాయం జరగబోతోంది’ అని ఊపిరి పీల్చుకుంటోంది. దేశ ప్రజలు ఆమెను సినిమాలో సీబీఐ ఆఫీసర్‌ను తెర మీద చూసినట్లు చూస్తున్నారు. కొన్ని సాహసోపేతమైన సంఘటనలు, మరికొన్ని సవాళ్లతో చట్టాన్ని పరిరక్షిస్తుందనే దఢ నమ్మకం వారిది. సంపత్‌ మీనా మీద అంత నమ్మకాన్ని పెట్టుకోవడానికి కారణం గతంలో ఆమె సాధించిన విజయాలే.
ఆపరేషన్‌ ముస్కాన్‌
సంపత్‌ మీనా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్‌. హిస్టరీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. జార?ండ్‌ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్‌ ఆఫీసర్‌. జార్ఖండ్‌ రాజధాని రాంచితోపాటు ధన్‌బాద్‌, జమ్‌తారా, ధమ్‌కా, దేవ్‌ఘర్‌, పాకుర్‌ జిల్లాల్లో ఎస్‌పీగా తన మార్కు చూపించారామె. చోటా నాగ్‌పూర్‌లో డీఐజీగా క్రియాశీలకంగా పనిచేశారు. చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌ స్టేషన్‌ అనే కాన్సెప్ట్‌ ఆమె మానస పుత్రిక. జార్ఖండ్‌లోనే ఆమె ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు సంపత్‌ మీనా. తప్పిపోయిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, అక్రమ రవాణా కారణంగా తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను వెతికి పట్టుకుని, వాళ్లను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే కార్యక్రమం అది. ముస్కాన్‌ అంటే చిరునవ్వు. తల్లిదండ్రులకు దూరమయ్యి, నవ్వును మర్చిపోయిన బాల్యంలో తిరిగి నవ్వులు పూయించే కార్యక్రమం. ఈ ఆపరేషన్‌ ముస్కాన్‌లో ఒక్క జార్ఖండ్‌లోనే ఏడు వందల మందికి పైగా పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు సంపత్‌మీనా. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని పిల్లలకు ప్రభుత్వ సంరక్షణ గహాల్లో వసతి కల్పిస్తారు. ఆర్గనైజ్‌డ్‌ క్రౖెెమ్‌ ఐజీగా సంపత్‌మీనా పర్యవేక్షణలో ఆపరేషన్‌ ముస్కాన్‌ దేశవ్యాప్తంగా ఆశించిన ఫలితాలనిచ్చింది. లక్నోలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌కంటే ముందు ఆమె న్యూఢిల్లీలో పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యూరోలో ఐజీ(ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌). అప్పుడు కూడా పిల్లల అక్రమ రవాణా కేసులను ఛేదించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆమెకు మహిళల సమస్యలు, మానవ హక్కుల కోసం ఆమె ప్రత్యేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. జార?ండ్‌ రాజధాని రాంచిలో ‘సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌’ అయిన తొలి మహిళ సంపత్‌ మీనా. సీఐడీ ఐజీగా, రైల్వేస్‌ ఐజీగా కూడా మంచి సేవలందించారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థంగా పని చేశారు. ఉన్నావ్‌ కేసు దర్యాప్తు న్యాయరక్షణే లక్ష్యంగా సాగాలంటే సంపత్‌ మీనా వల్లనే సాధ్యమవుతుందని నమ్మకం కలగడానికి ఇవన్నీ కారణాలే.
రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌

సంపత్‌ మీనా విశిష్ట సేవలకు గాను ‘2008 చీఫ్‌ మినిస్టర్‌ మెడల్‌’, 2013 రాష్ట్రపతి మెడల్‌ అందుకున్నారు. పోలీస్‌ ట్క్రెనింగ్‌లో కూడా పై అధికారులకు సంపత్‌ మీనా ప్రత్యేకమైన పోలీస్‌ అధికారి అవుతుందనే నమ్మకం కలిగేది. ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ సమయంలో బెస్ట్‌ అథ్లెట్స్‌ ట్రోఫీ అందుకున్నారు. ఇటలీలో పోలీస్‌ కోర్సులో గ్రాడ్యుయేషన్‌ చేశారామె. సీనియర్‌ లెవెల్‌ ప్రోగ్రామ్‌లో అమెరికాలో శిక్షణ పొందారు. రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా, పక్షపాతరహితంగా దర్యాప్తు జరగాలంటే సంపత్‌ మీనా ఒక్కరే బెస్ట్‌ అని ఇప్పుడు దేశమంతా నమ్ముతోంది. ‘ఉన్నావ్‌’ బాధితురాలికి న్యాయం జరగాలంటే సంపత్‌ మీనా లాంటి ఆఫీసరే అండగా నిలవాలని న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కరడు గట్టిన మ గాహంకారి కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌కు, అతడి బందానికి గుణపాఠం చెప్పగలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ సంపత్‌ మీనా. కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ పట్టణంలో నివసిస్తుండేవాడు. ఉన్నావ్‌ పట్టణం జిల్లా కేంద్రం కూడా. అతడు మొదట 2002లో ఉన్నావ్‌ నియోజకవర్గం నుంచి బిఎస్‌పీ అభ్యర్థిగా గెలిచాడు. తర్వాత 2007, 2014 లలో సమాజ్‌వాది పార్టీ తరఫున బంగేర్‌మావ్‌, భగవంత్‌ నగర్‌ల నుంచి గెలిచాడు. ఆ తర్వాత 2017 నాటికి బిజెపిలో చేరి బంగేర్‌మావ్‌ నుంచి గెలిచాడు. ఉద్యోగం కోసం వెళ్లిన పదిహేడేళ్ల అమ్మాయి మీద లైంగిక అఘాయిత్యానికి పాల్పడి ఇప్పుడు సీతాపూర్‌ జైల్‌లో ఉన్నాడు.
మౌనసాక్షి… ఉన్నావ్‌
ఈ ఏడాది జూలై నెల 28వ తేదీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నుంచి ఒక కారు రాయ్‌బరేలీ వైపు వెళ్తోంది. రాయ్‌బరేలీకి చేరేలోపే ఒక ట్రక్కు భూతంగా వచ్చి కారుకు గుద్దింది. చూడడానికది ఊహించని ప్రమాదంగానే కనిపిస్తోంది, కానీ నిజానికి అది వ్యూహాత్మక ప్రమాదం. కారులో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా బతికి బట్టకట్టకూడదనేటంత క్రౌర్యంతో పన్నిన పన్నాగం. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మహిళల ప్రాణాలు పోయాయి. ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఓ మగ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డారు.
అంతకంటే ముందు…
గత ఏడాది ఏప్రిల్‌ 13వ తేదీ. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఉన్నావ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, బంగేర్‌మావ్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌కు సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ప్రశ్నించిన తర్వాత అతడి మీద ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసి వారం రోజులు జుడీషియల్‌కస్టడీని విధించింది అలహాబాద్‌ హైకోర్టు.అంతకు ముందు కూతురికి జరిగిన అన్యాయం మీద న్యాయపోరాటం చేస్తున్న ఓ తండ్రిని అరెస్ట్‌ చేసి జుడీషియల్‌ కస్టడీ విధించడమైంది. తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేని అతడి కూతురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆత్మత్యాగానికి సిద్ధమైంది. ఇంత భావోద్వేగాలతో అట్టుడిగిపోతున్న ఉత్తరప్రదేశ్‌లో ఆ తండ్రిని చనిపోయేవరకు చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. కూతురి కోసం తండ్రి న్యాయ పోరాటం ఒకవైపు, తండ్రి ప్రాణాలు కాపాడ్డం కోసం కూతురి ఆవేదన పోరాటం మరో వైపు. ఇంత హ దయవిదారకమైన పరిస్థితికి దారి తీసిన దురాగతం 2017, జూన్‌ నాలుగవ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజు ఉన్నావ్‌లోని కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి ఉద్యోగం ఇప్పించమని వెళ్లింది ఓ పదిహేడేళ్ల అమ్మాయి. ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ మ గాహంకారానికి బలయింది. మైనారిటీ తీరని అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన కుల్‌దీప్‌ సింగ్‌ను పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌) చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఇప్పుడతడు సీతాపూర్‌ జైల్‌లో ఉన్నాడు. అతడి కేసు విచారణకు వస్తే శిక్ష పడడం ఖాయమని తెలిసిన కుల్‌దీప్‌… అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులను చేయడానికి తెగపడ్డాడు. బాధితురాలి తండ్రిని జైల్లో చిత్రహింసలకు గురి చేసి చంపించాడు. తండ్రి పోయిన తర్వాత కూడా బాధితురాలు న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో గుద్దించి హత్యాప్రయత్నం చేశాడు కుల్‌దీప్‌. ఆ ప్రమాదంలో గాయపడిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఆమె లాయరు (జూలై 31వ తేదీన) తమకు రక్షణ కల్పించి, కేసును విచారించి తగు న్యాయం చేయవలసిందిగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఉత్తరం రాశారు. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ కేసును సత్వరమే విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ సంపత్‌ మీనాకు బాధ్యతలకు అప్పగించింది.