విత్తన పంటలపై రైతులకు ప్రోత్సాహం

జిల్లాల వారిగా భూములను బట్టి పంటల ఎంపిక 
దిశానిర్దేశం చేస్తున్న వ్యవసాయశాఖ 
హైదరాబాద్‌,జూలై29: ఇటీవలే విత్తన ఉత్పత్తిపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణలో విత్తన పంటలకు ఆసక్తి పెరిగింది. వ్యవసాయ శౄఖ కూడా విత్తన పంటలను ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా వ్యవసాయశాఖ కార్యదర్వఙ పార్థసారథి వివిధ జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకోవడం ద్వారా రైతులను విత్తన పంటలవైపు ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు కూడా లాభాలు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు తీసుకొంటున్నారు. విత్తన ఉత్పత్తి విషయంలో తెలంగాణ జిల్లాలు అగ్రస్థానంలో నిలబడి ఎక్కువ మంది రైతులు విత్తన ఉత్పత్తిలో పాల్గొనేలా కార్యాచరణ చేస్తున్నారు. ఇందుకోసం రైతులకు అవగాహనకు చర్యలు తీసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో యాంత్రికసాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ 
లాభాలు సాధిస్తున్నారు. యాంత్రిక సాగుపై దృష్టిసారించి అధిక లాభాలు వచ్చే కొత్త పద్ధతులు రూపొందించాలని పిలుపునిచ్చారు. పాలీహౌస్‌ సాగులక్ష్యం పెంచాలని నిర్ణయించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం వారిదేనన్నారు. దేశంలో తొలిసారిగా పాలీహౌస్‌ సాగును హర్యానాలో ప్రారంభించారని, ఏడాదికి 150 ఎకరాల్లో సాగు చేస్తే.. తెలంగాణలో రెండేండ్లలో వేయిఎకరాల్లో సాగైందని తెలిపారు. మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాల్లో పాలీహౌస్‌ సాగుచేస్తూ బాగా సంపాదిస్తున్నారని చెప్పారు. దీంతో కూరగాయలు, పళ్లు పండించవచ్చిన అంటున్నారు. వ్యవసాయంలో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం, దశపర్ని కషాయం, సప్త దాన్యాంకుర కషాయం, ఆచ్చాదన, వాప్స వంటి పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో మామిడి, కొబ్బరి, చింత, శీతాఫలం, దానిమ్మ, ఆముదంతో పాటు పసుపు, చెరకు, మొక్కజొన్న, వరి పంటలను పండించవచ్చని తెలిపారు. ఇకపోతే నానాటీకి అంతరించిపోతున్న ఆవులను సంరక్షించుకొంటే ఎన్నో లాభాలు ఉన్నాయని, ఒక్క ఆవు పేడ, మూత్రంతో దాదాపు 25 నుంచి 30 ఎకరాలను సాగుచేయవచ్చునని, దీంతో సాగుచేసిన పంటలు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయని తెలిపారు. అంతర పంటల ద్వారా వచ్చే లాభంతో ప్రధాన పంట ఖర్చులు 
తీరిపోతాయి. ప్రధాన పంట నుంచి వచ్చే సంపాదన అదనపు సంపాదన అవుతుంది. ఏక పంటలు సాగుచేయకుండా మిశ్రమ పంటలను సాగుచేస్తే కనీసం 20 రకాల పంటలు వేసుకొవచ్చు. కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వ్యవసాయమంత్రి పలు సందర్బాల్లో దీనిపై కార్యాచరణ ప్రకటించారు. పలు కంపెనీలు కూడా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయడానికి ముందుకు వచ్చాయి. ప్రస్తుతం విత్తన ఉత్పత్తికి రైతులతో ఒప్పందాలకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మరికొంత విస్తీర్ణంలోనూ పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులు లాభాలు ఆర్జించేందుకు ప్రోత్సాహం అందించాలని విత్తన కంపెనీలకు ఇటీవల మంత్రి పోచారం సూచించారు. విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల విత్తన కంపెనీల ప్రతినిధులు ఇటీవలి సదస్సులో సమావేశమయి చర్చించారు. దీనికితోడు ఇంజినీరింగ్‌ విద్యార్థులు 
యాంత్రికసాగుపై దృష్టి సారించి అధిక లాభాలు వచ్చేలా కొత్త పద్ధతులు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.