దివికేగిన దిగ్గజం

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైౖపాల్‌రెడ్డి కన్నుమూత 

సమకాలీన రాజకీయాల్లో నిజాయితీ.. నమ్మిన సిద్ధాంతం కోసం.. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అవసరమైతే అంబానీలకైనా చెక్‌ చెప్పే దమ్ము.. ధైర్యం.. తెగువ.. లాంటి గుణాలతో పాటు.. అపారమైన మేధోతనం ఉట్టిపడే అరుదైన వ్యక్తిత్వం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్‌ రెడ్డి. గాంధేయవాద పరంపరకు, సోషలిస్ట్‌ భావజాలానికి ఆయన దాదాపు చివరి ప్రతినిధి అనుకోవచ్చు. సాహిత్యాన్ని, తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ పునాదుల మీద రాజకీయవాదాన్ని నిర్మించుకున్న రాజకీయ నాయకుడు జైపాల్‌ రెడ్డి. ఆరిస్టాటిల్‌ నుంచి మార్క్స్‌ దాకా ఆయన దేని గురించైనా మాట్లాడేవారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌ ఆయనే రూపొందించారు. భారతదేశ ప్రాధాన్యాల గురించిన ఆయన అవగాహన ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ డాక్యుమెంట్‌ ఒక్కటి చాలు. ఆ స్థాయి కలిగిన నేతలు ఇప్పుడు ఎవరున్నారో వెతకడం కూడా కష్టమే. ఆయన రాజకీయ తత్వవేత్త లేదంటే తాత్విక రాజకీయవేత్త. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే, ఆయన ఏ అంశాన్నీ ఉపరితలంగా, ఆరోపణలే ప్రధానంగా చేసుకుని మాట్లాడరని తెలిసిపోతుంది. ప్రతి సమస్యకున్న తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడడం ఆయన నైజం. అందుకే, ఆయన స్వరం వినిపిస్తే పార్లమెంటు నిశ్శబ్దంగా చెవులు రిక్కించేంది. లౌకిక స్ఫూర్తికి ఆయన నిఖార్సయిన నిదర్శనం. ——————————————— 
హైదరాబాద్‌: 
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి ఆదివారం మతి చెందారు. గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా జైపాల్‌ రెడ్డి నిమోనియాతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను నేటి మధ్యాహ్నం నిర్వహించనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు ఆయన పార్థివదేహాన్ని గాంధీభవన్‌కు తీసుకొస్తారు. ఉదయం 11 గంటల వరకు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. మరోవైపు నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌ పక్కనే జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పీవీ ఘాట్‌ పక్కన స్థలాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి పరిశీలించారు. 
ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే 
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన పెట్రోలియం మరియు సహజవాయువు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జైపాల్‌ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్‌.ఎ. పట్టా పొందారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్‌ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ముందుగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యునిగా ఉన్నా ఆయన ఇందిరా గాంధీ పాలనలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్‌ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డారు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో రెండు సార్లు కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. 
ఉత్తమ పార్లమెంటేరియన్‌ 
1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. జైపాల్‌ రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు పీవీ ఘాట్‌ వద్ద జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నేటి ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం జైపాల్‌ రెడ్డి భౌతికకాయాన్ని గాంధీ భవన్‌కు తరలించి నేతలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం గంటపాటు ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. 
నల్గొండతో విడదీయరాని అనుబంధం 
ఉమ్మడి నల్గొండ జిల్లాకు, జైపాల్‌ రెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. జైపాల్‌ రెడ్డి స్వగ్రామం మాడుగుల. కానీ నల్గొండ జిల్లాలో జైపాల్‌కు పెద్ద ఎత్తున బంధుమిత్రులు ఉన్నారు. ఆయన స్వగ్రామం మాడుగుల అయినా.. పుట్టింది మాత్రం ఆయన అమ్మమ్మ వారి ఊరు అయిన చండూరు మండలం నెర్మెట్టలో. నల్గొండ జిల్లాలో జరిగే బంధువుల పంక్షన్లకు జైపాల్‌ రెడ్డి తరచుగా హాజరయ్యేవారు. నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి జైపాల్‌ రెడ్డి మేనమామ. ఈ క్రమంలో నల్గొండ జిల్లాతోనూ రాజకీయంగా జైపాల్‌కు బలమైన అనుబంధం ఏర్పడింది. సీనియర్‌ నేత జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా జైపాల్‌తో ఎప్పటి నుంచో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు కేంద్ర నిధులతో జైపాల్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. అదే విధంగా హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారి విస్తరణపైనా దష్టి సారించారు. కేవలం రెండు లైన్లుగా ఉన్న ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ పనులకు జైపాల్‌ హయాంలోనే శ్రీకారం చుట్టారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో రహదారి విస్తరణ పనులకు నార్కెట్‌పల్లి వద్ద భూమి పూజ చేయించారు. 
అభివృద్ధి పనులకు అడ్రస్‌గా నిలిచారు 
అంతేకాదు.. నాగార్జున సాగర్‌ ఆధునీకరణ పనుల శ్రీకారంలోనూ జైపాల్‌ రెడ్డి పాత్ర ఉంది. కష్ణా నది వెంట వెలిసిన సిమెంట్‌, నాపరాయి పరిశ్రమల సమస్యలపై ప్రత్యేకంగా ద ష్టి సారించారు. రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో రైల్వేలైన్‌ ఏర్పాటుకు కషి చేశారు. జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు.. అక్కడి నుంచి దామరచర్ల మండలం విష్ణుపురం వరకు గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. దీంతో సిమెంట్‌ పరిశ్రమలకు దశాబ్దాల ఎగుమతుల సమస్యలు తీరిపోయాయి. పలు రహదారుల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర మంత్రిగా, ఎంపీగా చేసిన క షిని జైపాల్‌ రెడ్డి మతి సందర్భంగా మరోసారి నల్గొండ జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి మతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన మంచి నేతను కోల్పోయామని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు కూడా ఆయన మ తి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మ తిపట్ల సంతాపం తెలిపారు. ఆయన మ తి కాంగ్రెస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. 
అందరినీ కలుపుకొనిపోయే తత్వం ఆయనది.. 
జైపాల్‌ రెడ్డి మతిపట్ల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణకి తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం సోనియా గాంధీని ఒప్పించిన నాయకుడు జైపాల్‌ రెడ్డి అని కీర్తించారు. ఆయనతో తనకు 30ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. అసెంబ్లీలో కలిసి పనిచేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొనిపోయే మనస్తత్వం ఆయన సొంతం అని చెప్పుకొచ్చారు. 
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర.. 
జైపాల్‌ రెడ్డి మ తి తమను తీవ్రంగా బాధించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన మతి తెలంగాణకు, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. జైపాల్‌ రెడ్డి అంతిమ యాత్ర ఆయన ఇంటి నుంచి మొదలై నేటి ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్‌కు చేరుకుంటుందని ఉత్తమ్‌ చెప్పారు. ఆయన పార్థీవదేహాన్ని గాంధీ భవన్‌లో ఒక గంట సేపు ఉంచుతామన్నారు. ఏఐసీసీ నుంచి పాండిచ్చేరి సీఎం, మల్లిఖార్జున ఖర్గే వస్తారని తెలిపారు. జైపాల్‌ రెడ్డి దహన సంస్కారాలకు నెక్లెస్‌ రోడ్డులో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 
విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రస్థానం.. 
జైపాల్‌ రెడ్డి మతి తమను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్‌ పార్టీ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఆయన మతికి సంతాపం ప్రకటించారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జైపాల్‌ రెడ్డి.. అంచెలంచెలుగా ఎదిగి గొప్ప నేతగా గుర్తింపుపొందారని కీర్తించారు. ఆయన మతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని పేర్కొన్నారు. 
వీరితోపాటు.. గులాంనబీ ఆజాద్‌, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సురవం ప్రతాప్‌ రెడ్డి, చాడ వెంకట్‌ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జూపూడి ప్రభాకర్‌ రావు, తులసిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
ఆయన మాటలు తూటాల్లా దూసుకుపోయేవి. సమగ్రంగా, సమాచారసహితంగా మాట్లాడడం ఆయనకే సొంతం. కఠినమైన ఆంగ్లపదాల్ని సైతం అలవోకగా వాడగలిగే నేర్పు ఆయన ప్రతిభకు నిదర్శనం. చిన్నతనంలోనే అంగవైకల్యం సంక్రమించినా.. తన ప్రతిభతో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎదిగిన వ్యక్తి జైపాల్‌ రెడ్డి. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు… 
17 ఏళ్ల వయసులో అరడజను ఆంగ్ల పత్రికలు… 
మాడుగుల, దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన జైపాల్‌రెడ్డి కాలేజీ చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చారు. నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆ సమయంలో కోఠికి వెళ్లి మార్కెట్లో ఉండే పత్రికలన్నీ తెచ్చుకొనేవారు. రోజుకు కనీసం అరడజను ఆంగ్ల పత్రికలు చదివేవారు. దీంతో ఆంగ్ల భాషపై ఎనలేని పట్టు సాధించారు. ఈ నైపుణ్యంతో కాలేజీలో నిర్వహించే వక్తత్వ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ ప్రసంగాలే తదనంతర కాలంలో ఆయన రాజకీయ జీవితానికి పునాదులు వేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు అర్థరాత్రి వరకు పుస్తక పఠనంలోనే గడిపేవారు. తరగతులకు పెద్దగా హాజరయ్యేవారు కాదు. ఎం.ఏ చివరి సంవత్సరంలో హాజరుశాతం తక్కువగా ఉన్న కారణంగా.. పరీక్షలకు అనుమతించలేదు. వీసీ జోక్యం చేసుకొని పరీక్షలు రాయడానికి అనుమతి ఇప్పించారు. 
సొంత కుటుంబ సభ్యుల్నే మరచిపోయేవారు… 
జైపాల్‌రెడ్డి నిద్ర లేవకముందే ఆయన ఇంటికి చాలా మంది వచ్చి ఉండేవారు. ప్రజలతో ఇళ్లంతా సందడిసందడిగా ఉండేది. వాళ్ల సమస్యల్ని పరిష్కరించడంలో నిమగ్నమై కుటుంబ సభ్యుల్ని ఏమాత్రం పట్టించుకునేవారు కాదట. పండగలు, ఇంట్లోవాళ్ల పుట్టినరోజులు ఇతర వేడుకలు ఆయన అసలు గుర్తుండేవి కాదని ఓ సందర్భంలో ఆయన కూతురు అరుణ తెలిపారు. 
గుడికి వెళ్లరు… 
జైపాల్‌ రెడ్డి హేతువాది. లౌకికవాదంపై అపార నమ్మకం. ప్రజలంతా కులమతాల్లేకుండా.. కలిసి ఉండాలని ఆకాంక్షించేవారు. దసరా పండగ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతి దసరాకు సొంత గ్రామం మాడుగులకు వెళ్లేవారు. 
డిక్షనరీని బట్టీపట్టారు… 
ఆయన పుస్తకాల పురుగు. తత్వశాస్త్ర పుస్తకాలంటే మరీ ఇష్టంగా చదివేవారట. చిన్నప్పుడు ఇంగ్లిషు బాగా నేర్చుకోవాలని ఉండేదట. దాంతో ఓ డిక్షనరీ కొనుక్కున్నారట. రోజూ దాన్ని తీసుకొని ఊరి చివరన గట్టు మీదకి వెళ్లిపోయి రోజుకో పేజీ బట్టీ పట్టేసేవారట. బెర్ట్రాండ్‌ రస్సెల్‌, షేక్‌స్పియర్‌, హెచ్‌.జి.వెల్స్‌, కేన్స్‌, బెర్నాడ్‌ షా సాహిత్యంలో ఏ సందేహం అడిగినా ఇట్టే చెప్పేసేవారట. తెలుగు సాహిత్యంపైనా ఆయనకు చాలా మక్కువ ఉండేదట. 
మాంసాహారమంటే ఇష్టం… 
కుటుంబ, సామాజిక పరిస్థితుల రీత్యా జైపాల్‌ రెడ్డి 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. యుక్త వయసులో సినిమాలు బాగా చూసేవారు. పెళ్లయిన తర్వాత క్రమంగా తగ్గించి పుస్తక పఠనంపైకి ద ష్టి మళ్లించారు. నిరాడంబరంగా ఉండడమంటే చాలా ఇష్టం. ఎంత పని ఒత్తిడి ఉన్నా ముఖం మీద మాత్రం చిరునవ్వుతో కనిపించేవారు. రుచికరమైన వంటల్ని ఆస్వాదిస్తూ తినేవారు. ఇక మాంసాహారం గురించి చెప్పనక్కర్లేదు. 

జైపాల్‌రెడ్డి మతికి సంతాపం 
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి(77) మ తిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప పార్లమెంటేరియన్‌, నాయకుడిని కోల్పోయిందని అన్నారు. జైపాల్‌ మతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తమపార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. జైపాల్‌ రెడ్డి మతిపట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర సంతాపం తెలిపారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘకాలం జాతీయ రాజకీయాల్లో జైపాల్‌ తనదైన ముద్రవేశారని తెదేపా నేత కంభంపాటి రామ్మెహన్‌రావు అన్నారు. ఆయన మ తి తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే తీరని లోటు అని అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెరాస నేతలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వినోద్‌, కవిత, కాంగ్రెస్‌ నేతలు హనుమంతరావు, జీవన్‌రెడ్డి తదతరులు జైపాల్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. 
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని జైపాల్‌ నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెరాస నేతలు కె.కేశవరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌ రెడ్డి మ తిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఎన్నో ఏళ్లపాటు క షి చేసిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 
‘కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి మతికి చింతిస్తున్నాను. ఆయన అద్భుతమైన పార్లమెంటేరియన్‌, తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన తన జీవితాన్ని మొత్తం ప్రజల సేవకే అంకితం చేశారు. ఆయ కుటుంబానికి, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. 
నేటితరానికి ఆదర్శం:కిషన్‌రెడ్డి 
ప్రజల పక్షాన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చేసిన ఉద్యమాలు నేటి తరానికి ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి నివాసంలో ఆయన భౌతికకాయానికి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా..జైపాల్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. దేశ అభివ ద్ధి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని, రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రావడంలో జైపాల్‌రెడ్డి పాత్ర శ్లాఘనీయమన్నారు. తెలంగాణ ప్రజలు ఆయనను ఎప్పటికీ మరువరని అన్నారు. కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 
కర్ణాటక స్పీకర్‌ నివాళి 
జాతీయ రాజకీయాల్లో ఓ గొప్ప నాయకుడ్ని కోల్పోయామని కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. జైపాల్‌రెడ్డి మతిపట్ల ఆయన సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలకన్నా వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యతనిచ్చేవారని రమేశ్‌కుమార్‌ కొనియాడారు. 
చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల నివాళులు 
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి మతి పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి తనదైన ముద్రవేశారని, ఆయన మ తి కాంగ్రెస్‌కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
రాజనీతిజ్ఞుడు జైపాల్‌ మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగుతో పాటు, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం వల్ల చట్ట సభల్లో ఆయన ప్రసంగాలు సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు గెలుపొందడం కీర్తించదగిన విషయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం రాజకీయ వేత్తలకు, యువకులకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు పవన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
వ్యక్తిగతంగా తీరని లోటు.. 
జైపాల్‌రెడ్డి మతి పట్ల టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోశించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మ తితో కాంగ్రెస్‌ పార్టీ శోక సముద్రంలోమునిగిపోయిందని చెప్పారు. తనతో జైపాల్‌రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా ఆయన మ తి తనకు తీరని లోటని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జైపాల్‌రెడ్డినీతికి నిజాయితీకి మారుపేరైన వ్యక్తి. రాజకీయ నాయకుల్లో అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు’ అన్నారు. 
నివాళులర్పించిన ప్రముఖులు.. 
జైపాల్‌రెడ్డి మతిపట్ల విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, వినోద్‌ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి మ తిపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రఘురామ క ష్ణంరాజు సంతాపం తెలియజేశారు. జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, వీ హనుమంతారావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి నివాళులర్పించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.